15-12-2025
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ, తలసేమియా సెంటర్ నందు తేదీ 15-12-2025 న తలసేమియా పిల్లల కొరకు శ్రీ భగవాన్ మహావీర్ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రెసిడెంట్ ఐన శ్రీ జె.పి జైన్ మరియు జైన్ అసోసియేషన్ సభ్యులు శ్రీ ధర్మేంద్ర జైన్, కమలేష్ జైన్ వారి 20 బెడ్స్ ను విరాళంగా అందచేశారు. ఈ సందర్భంగా శ్రీ జె.పి జైన్ గారు మాట్లాడుతూ తలసేమియా పిల్లలకి బెడ్స్ ఇవ్వడం చాలా సంతోషాన్ని ఇచ్చినదని, రాబోవు రోజులలో కూడా వారి ట్రస్ట్ తరపున సహాయ సహకారాలని అందచేస్తామని తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ ఛైర్మన్ శ్రీ వాకాటి విజయ కుమార్ రెడ్డి, వైస్ ఛైర్మన్ శ్రీ చమర్తి జనార్ధన్ రాజు మేనేజింగ్ కమిటీ సభ్యులు శ్రీ బయ్యా ప్రసాద్, దాసరి రాజేంద్ర ప్రసాద్, తలసేమియా ఎగ్జిక్యూటివ్ మెంబర్ డాక్టర్ సీత, సేవ ఎగ్జిక్యూటివ్ మెంబర్ శ్రీమతి షేక్ పర్వీన్, బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ dr S. వర ప్రసాద్ సిబ్బంది మరియు లైఫ్ మెంబర్స్ పాల్గొన్నారు.