24.04.2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఎస్.పి.ఎస్.ఆర్.నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ వాకాటి విజయ కుమార్ రెడ్డి గౌరవ అధ్యక్షతన ఐ.ఆర్.సి.ఎస్., ఎం.ఎస్.ఆర్.స్పాస్టిక్స్ సెంటరు యందు న్యూరోజన్ బ్రెయిన్ మరియు స్పైన్ ఇన్స్టిట్యూట్, ముంబాయ్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ సుచితా చౌదరి మరియు డాక్టర్ సుశీల్ నవజాత శిశువుల నుండి 15 సంవత్సరాల వయసుగల విభిన్నప్రతిభావంతులు అయిన బాలబాలికలకు సంబంధించిన న్యూరలాజికల్ డిజార్డర్ పై సెరిబ్రల్ పాలసీ పిల్లలకు సెల్ థెరపీ, న్యూరో రిహెబిలిటేషన్ ద్వారా అందించు చికిత్సలు తదుపరి స్పాస్టిసిటీ (కండరాల బిగింపు) తగ్గించుటకు, తమ కాళ్ళపై నిలబడుటకు తేలికపాటి చికిత్సలైన ఆక్యుపేషన్ థెరపీ, ఫిజియో థెరపీ మరియు కౌన్సిలింగ్ ల ద్వారా వారి తల్లిదండ్రులకు అవగాహనా సదస్సును నిర్వహించి, మెడికల్ క్యాంపు ను ఈ రోజు అనగా 24.04.2025 గురువారం ఉదయం 10 గంటలకు రెడ్ క్రాస్ మీటింగ్ హాల్లో నిర్వహించడం జరిగినది. ఏ సదస్సు లో ఎదుగుదల లోపాలు సరిదిద్దుటకు, బ్రెయిన్ డ్యామేజ్ ట్రీట్మెంట్ మరియు బలహీనపడిన నరములను సరిదిద్ది సాధారణ స్థితిలో మెరుగుపరుచుటకు ఈ థెరపీ సహాయకారి కాగలదని డాక్టర్లు తెలియ చేశారు. ఈ మెడికల్ క్యాంపులో __ పిల్లలను గుర్తించి తదుపరి మెరుగైన చికిత్సల కొరకు సిఫార్సు చేయడమైనది. రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ విజయవాడ బ్లడ్ సెంటర్స్ కో-ఆర్డినటర్ బి.వి.ఎస్ కుమార్, ఆశాజ్యోతి అధినేత మాధవీలత సహకారముతో నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యములో నిర్వహింపబదినది.
ఈ కార్యక్రమమునకు వైస్ ఛైర్మన్ చమర్తి జనార్ధన్ రాజు, ట్రెజరర్ సురేశ్ కుమార్ జైన్, ఐ.ఆర్.సి.ఎస్.స్పెస్టిక్స్ సెంటర్ కన్వీనర్ ఎంవి సుబ్బారెడ్డి, కో-కన్వీనర్ ఎన్.బలరామయ్య నాయుడు, సెక్రెటరీ పెళ్లూరు మస్తానయ్య, ప్రిన్సిపల్ పి.గురునాధరావు మరియు రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు.