07-05-2025

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శాఖ ఛైర్మన్ శ్రీ వాకాటి విజయకుమార్ రెడ్డి గారి సూచలన మేరకు తేదీ 07-05-2025 న తలసేమియా డే (May-8) ను పురస్కరించుకొని ముందస్తూగా వేడుకలను “తలసేమియా కోసం కలిసి: సంఘాలను ఏకం చేయడం, రోగులకు ప్రాధాన్యత ఇవ్వడం” అనే అంశం మీద ఘనంగా నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రములో ముఖ్య అతిదులుగా రెడ్ క్రాస్ నెల్లూరు జిల్లా శాఖ వైస్ ఛైర్మన్ శ్రీ చామర్తి జనార్ధన్ రాజు, కోశాధికారి శ్రీ సురేష్ కుమార్ జైన్, డాక్టర్ రమ్య, డాక్టర్ హరిత విచ్చేయడం జరిగినది. ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి రెడ్ క్రాస్ ఫౌండేర్ హెన్రి డ్యూనాంట్ చిత్రపటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అరిపించడం జరిగినది.
తలసేమియా బాధిత చిన్నారులకు రక్త మార్పిడి మరియు వివిధ సేవలలో భాగంగా ఏడాదికి 1500 యూనిట్ల రక్తాన్ని, రెడ్ క్రాస్ ఉచితంగా అందిస్తుందని డాక్టర్ రమ్య తెలిపారు. తల సేమియా బాధిత చిన్నారులు వారి వైకల్యాన్ని అధిగమించి, అందరి చిన్నారుల్లా సాధారణ జీవితం గడపాలనే ఉద్దేశంతో సంకల్ప ఫౌండేషన్ సహకారంతో రెడ్ క్రాస్ ద్వారా వారికి 25 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చయ్యే బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్స ను ఉచితంగా చేయిస్తున్నామని తెలిపారు. తలసేమియా కన్వీనర్ డాక్టర్ ఎస్.సీత మాట్లాడుతూ ఇప్పటివరకు 8 మంది చిన్నారులకు బోన్ మ్యారో ట్రాన్స్ ప్లాంటేషన్ చికిత్సను విజయవంతంగా నిర్వహించి వారిని తలసేమియా రహితులుగా మార్చి రెడ్ క్రాస్ వారికి మరో జన్మ ను ప్రసాదించడం జరిగినది. చిన్నారులకు బోన్ మ్యారో చికిత్సలు అందించేందుకు రెడ్ క్రాస్ ఎల్లవేళలా ముందుతుందని తెలియచేసారు. ఈ కార్యక్రమమున వచ్చినటువంటి వారందరికి మహా యాగ హెల్పింగ్ సొసైటీ వారు భోజన సదుపాయాలను అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ తలసేమియా కొకన్వీనర్ ఎస్.కె.పర్వీన్, సెక్రెటరీ పి. మస్తానయ్య, రెడ్ క్రాస్ బ్లడ్ సెంటర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వరప్రసాద్, స్పాస్టిక్ సెంటర్ ప్రిన్సిపాల్ శ్రీ పి.గురునాథం, మైథిలి స్కూల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బి.శశి ప్రియ, రెడ్ క్రాస్ మెంబర్స్, రెడ్ క్రాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

📘 4 January 2024, World Braille Day
07-05-2025

Leave A Comment

All fields marked with an asterisk (*) are required